జిల్లా కేంద్రంలో నకిలీ పాస్ బుక్ లు సృష్టించి ఓ బ్యాంకు నుంచి ఏకంగా 63 లక్షల రూపాయాలకు టోకరా వేసిన వైనం. మహబూబునగర్ లో చోటుచేసుకుంది. 67 మంది బినామి రైతుల పేర్లను సృష్టించి. ఓ వ్యక్తి మొత్తం డబ్బులను కాజేసిన విషయాన్ని సదరు బ్యాంకు అధికారులు గుర్తించారు.
దీంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. మహబూబునగర్ జిల్లా కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 2016 సంవత్సరానికి గాను పంట రుణాలను తీసుకునేందుకు శ్రీనివాస్ అనే వ్యక్తి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించాడు. 67 మంది బినామి పేర్లతో, 63 లక్షల, 78 వేల రూపాయలను, నకిలీ పాస్పుస్తకాల ద్వారా బ్యాంకు నుంచి బుణంగా పొందాడు.
వ్యవసాయ సాగు భూమి లేకుండానే ఉన్నట్లుగా, సృష్టించిన నకిలీ పాస్ పుస్తకాలతో, నిందితుడు శ్రీనివాస్ ఈ బుణాన్ని తీసుకున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేసిన అనంతరం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిగా నకిలీ పాస్ పుస్తకాల పూర్తి వివరాలు బయటపడింది. అసలు నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. విచారించిన నిమిత్తం తొమ్మది మందిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు...

EmoticonEmoticon